కోయంబత్తూరులో పలువురు మహిళలతో సంబంధాలు పెట్టుకున్న భర్తను భార్య పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ, భర్త మరో మహిళతో ఇంట్లో ఉండటం చూసిన భార్య, అతను మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో భర్త జననేంద్రియాన్ని (ప్రైవేట్ పార్ట్) కత్తిరించింది.
అసలేం జరిగిందంటే?
అస్సాంకు చెందిన బిదాన్ హజారికా (33) కోయంబత్తూరులో ప్లంబర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు జింతి. వీరిద్దరూ కోయంబత్తూరులోని గణపతి ప్రాంతంలో నివసిస్తున్నారు. బిదాన్కు పలువురు ఉత్తరాది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అతను తరచుగా వారితో వీడియో కాల్స్లో మాట్లాడుతూ, వారితో జల్సాలు చేసేవాడు.
ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె అతడిని మందలించింది. దీనివల్ల వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. అయినప్పటికీ బిదాన్ తన ప్రవర్తన మార్చుకోకుండా మహిళలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల జింతి ఇంట్లో లేని సమయంలో బిదాన్ ఒక యువతిని తన ఇంటికి తీసుకువచ్చాడు. జింతి అకస్మాత్తుగా ఇంటికి వచ్చేసరికి, తన భర్త మరొకరితో మంచంపై ఉండటం చూసి షాక్కు గురైంది.
కోపంతో ఊగిపోయిన భార్య
ఈ ఘటన తర్వాత జింతి తన భర్తతో తీవ్రంగా గొడవ పడింది. దీనికి సమాధానంగా బిదాన్ ఆమెను అస్సాం వెళ్ళిపోవాలని బెదిరించాడు. దీంతో తన భర్తకు తగిన బుద్ధి చెప్పాలని జింతి నిర్ణయించుకుంది. ఆ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన బిదాన్, మద్యం మత్తులో గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
భర్తపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జింతి, కత్తితో అతని ప్రైవేట్ పార్ట్ను కత్తిరించింది. అనంతరం అతడిని అదే గదిలో బంధించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నొప్పి భరించలేక బిదాన్ పెట్టిన కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలైన జింతిని అరెస్ట్ చేశారు.
