Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన ప్రాపర్టీ మీ సొంతం కాదు…సుప్రీం కోర్టు తాజా తీర్పు ఏం చెబుతోంది..

సాధారణంగా మనం ఒక స్థలం గాని ఇల్లు గాని కొనుగోలు చేస్తున్నామంటే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటాము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఆ స్థలం ఇక మనదే అని ఆ ప్రాపర్టీ పై మనకు సర్వహక్కులు ఉన్నాయని అనుకుంటాము.

అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే మీకు పూర్తి యాజమాన్య హక్కులు కావు అని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే కేవలం ఒక ఆర్థిక లావాదేవీ కి సంబంధించిన నమోదు మాత్రమే అని పేర్కొంది. దీని ద్వారా మీకు పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి అనుకోవడం పొరపాటే అని సుప్రీం తీర్పు ద్వారా అర్థమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

భావన కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే, 1982లో 53 ఎకరాల భూమిని భావన కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసింది. అనంతరం ఆ భూమిని పలువురికి విక్రయించింది. ఈ లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. దీనిపై కోర్టు తీర్పు ఇస్తూ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి యాజమాన్యం కిందికి రాదని హౌసింగ్ సొసైటీ కి ఆ భూమిపై పూర్తి హక్కులు లేవని పేర్కొంది. దీంతో రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా భూ యాజమాన్య హక్కు కిందకు రాదని ఈ తీర్పును బట్టి అర్థం చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ అంటే ఏంటి..? భూమిపై హక్కుల కోసం ఇంకా ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక లావాదేవీ జరిగినట్లు సూచించే నమోదు సంఖ్య మాత్రమే. రిజిస్ట్రేషన్ అనంతరం ఆ భూమిపై మీకు సర్వహక్కులు లభించవు అని తెలుసుకోవచ్చు. మీరు భూమిని కొంటున్న లేదా విక్రయిస్తున్న దానికి క్లియర్ టైటిల్ అనేది అవసరం అన్న సంగతి గుర్తించాలి. ప్రాపర్టీ మీదే అని నిర్ధారించడానికి రిజిస్ట్రేషన్ ఒకటే డాక్యుమెంట్ కాదు ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం. ముఖ్యంగా టైటిల్ డీడ్, సేల్ డీడ్, ప్రాపర్టీ టాక్స్ రసీదులు , భూమికి సంబంధించిన పట్టా, అలాట్ మెంట్ జరిగితే దానికి సంబంధించిన లెటర్స్ అనేవి తప్పనిసరి. ఈ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీది క్లియర్ టైటిల్ అవుతుంది. కేవలం రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన అది క్లియర్ టైటిల్ కిందకు రాదు.

ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
>>. మీరు ఒక ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నట్లయితే ఆ దానికి సంబంధించిన భూ యజమాని వద్ద ఆ భూమికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా వెరిఫై చేయించుకోవడం మంచిది. వీలైతే ఒక లీగల్ నిపుణుడిని సంప్రదించి డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ మీరు ప్రాపర్టీ కొనుగోలు కోసం బ్యాంకు రుణం తీసుకుంటున్నట్లయితే బ్యాంకు కూడా లీగల్ వెరిఫికేషన్ చేస్తుంది. తద్వారా మీరు కొనే ప్రాపర్టీ క్లియర్ టైటిల్ అవునా కాదా అనేది తేలుతుంది.

మీరు ప్రాపర్టీ కొనడానికి ముందుగా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. మొదట సేల్ డీడ్ చూసి, ఆ ప్రాపర్టీ అసలైన యజమాని ఎవరో, యజమాని పేరు, ప్రాపర్టీ క్లీన్‌గా ఉన్నదో లేదో గుర్తుంచుకోవాలి.

Related posts

మోడీ ఆత్మవిశ్వాసం దెబ్బతింది, బీజేపీ ఓటమి తప్పదు.. ”ఓట్ చోరీ” ర్యాలీలో రాహుల్ గాంధీ

M HANUMATH PRASAD

గురు దక్షిణగా పాక్ ఆక్రమిత కశ్మీర్ కావాలి’.. ఆధ్యాత్మిక గురువు సంచలన డిమాండ్.. ఆర్మీ చీఫ్ ఆన్సర్ ఇదే..

M HANUMATH PRASAD

రియాద్‌ ఆసుపత్రిలో చేరిన గులాంనబీ ఆజాద్‌

M HANUMATH PRASAD

పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్

M HANUMATH PRASAD

నన్ను పెళ్లి చేసుకోండి…: పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా… వెలుగులోకి షాకింగ్ విషయాలు…!

M HANUMATH PRASAD

వడగళ్ల వానతో ఇండిగో విమానం ధ్వంసం.. వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో

M HANUMATH PRASAD