Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్‌ యాత్ర జూన్‌ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్లామిక్‌ చంద్రమాన క్యాలెండర్‌లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్‌ యాత్ర తేదీలను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.

ప్రతి ఏటా ఈ తేదీలు మారుతుంటాయి.

ఈ ఏడాది జూన్‌ 4 నుంచి నాలుగు రోజులపాటు హజ్‌ యాత్ర కొనసాగుతుంది. ఇందులో రెండో రోజు అంటే జూన్‌ 5న అరాఫత్‌ మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో హజ్‌ యాత్రికులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. మహమద్‌ ప్రవక్త చివరి ఉపన్యాసం ఇచ్చిన రోజుగా దీనిని పరిగణిస్తారు. జూన్‌ 6న ఈద్‌-అల్‌-అధాను జరుపుకుంటారు. ఈసారి హజ్‌ యాత్రలో దాదాపు పది లక్షల మంది ముస్లింలు పాల్గొంటారని అంచనా.

Related posts

భారత్‌ చర్యల నేపథ్యంలో.. భుట్టో నేతృత్వంలో విదేశాలకు పాకిస్థాన్‌ నేతలు

M HANUMATH PRASAD

బలూచ్ వేర్పాటు వాదులకు భారత్ మద్దతిస్తే!?

M HANUMATH PRASAD

‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్‌ ఆర్మీ చీఫ్‌

M HANUMATH PRASAD

ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి!

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

M HANUMATH PRASAD

భారత్‌పై భారీ కుట్ర- ఐఎస్ఐ అడ్డాగా ఢిల్లీలోని పాక్ హైకమిషన్

M HANUMATH PRASAD