Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

మోడీ నాయకత్వంలో దేశం సేఫ్‌గా లేదు.. CPI నేత రాజా కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) నేతృత్వంలో దేశం సేఫ్‌గా లేదని సీపీఐ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా(D.Raja) విమర్శించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడి నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మోడీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పర్యాటకుల మృతిపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పెహల్గాం(Pahalgam) ఘటనపై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించి..

సుదీర్ఘంగా చర్చించాలని డిమాండ్ చేశారు. చర్చ జరిగితే సభా వేదికగా మోడీని నిలదీస్తామని అన్నారు. భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాలు అవసరం లేదని తెలిపారు. అసలు ఇండియా మీద ట్రంప్ పెత్తనం ఏంటని సీరియస్ అయ్యారు.

కాగా, భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తమ ఘనతేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే అమెరికా నేత, పెంటగాన్‌ (Pentagon) మాజీ అధికారి మైఖేల్‌ రూబిన్ (Michael Rubin) స్పందించి ట్రంప్‌పై విమర్శలు చేశారు. అమెరికన్లలాగే భారతీయులు కూడా ట్రంప్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంటర్నెట్ కనిపెట్టడం నుంచి క్యాన్సర్‌ను నయం చేసేవరకు అన్నింటికీ క్రెడిట్‌ తీసుకోవడం ట్రంప్‌నకు అలవాటేనని రూబిన్‌ ఎద్దేవా చేశారు.

Related posts

ముస్లిం ఎంపీ హసన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాను.. ఇకపై ఒవైసీ నాకు బావమరిది.. కర్ణి సేన చీఫ్ షాకింగ్ వీడియో

M HANUMATH PRASAD

మీరు ఎవరికైనా చెక్కు ఇస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. కొత్త నిబంధనలు!

M HANUMATH PRASAD

ఇండియాలో ఉండి లేకి పాక్ కు సపోర్ట్ చేసేవాళ్లు.. చూడాల్సిన వీడియో ఇది!

M HANUMATH PRASAD

రాష్ట్రపతికి సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ద్రౌపది ముర్ము సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

డీఎస్పీ వాహనానికి నిప్పు పెట్టిన ఇసుక మాఫియా.. ఘర్షణలో ఒకరు మృతి

M HANUMATH PRASAD

బీజేపీలో చేరిన పహల్గాం ఉగ్రవాదులు: సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD