Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

ఇండియాపై దాడికి నవాజ్ రూపకల్పన చేశారన్న అజ్మా బుఖారీ

భా రత్‌పై ఇటీవల పాకిస్థాన్ చేపట్టిన సైనిక చర్య మొత్తం తమ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలోనే రూపుదిద్దుకుందని అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, పంజాబ్ ప్రావిన్స్ సమాచార శాఖ మంత్రి అజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సోదరుడు, మూడు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోనే ఈ ఆపరేషన్ జరిగిందని ఆమె స్పష్టం చేశారు.”నవాజ్ షరీఫ్ సాధారణ నాయకుడు కాదు.

ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది” అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. “పాకిస్థాన్‌ను అణు శక్తిగా మార్చింది నవాజ్ షరీఫే, ఇప్పుడు భారత్‌పై జరిగిన ఆపరేషన్‌కు కూడా ఆయనే రూపకల్పన చేశారు” అని ఆమె పేర్కొన్నారు.ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, మే 7వ తేదీ తెల్లవారుజామున భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. దీని అనంతరం, మే 8, 9, 10 తేదీలలో పాకిస్థాన్ భారత సైనిక స్థావరాలపై దాడికి విఫలయత్నం చేసింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన తీవ్ర సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం, శనివారం నాడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కాల్పుల విరమణపై ఒక అవగాహన కుదిరింది. ఈ పరిణామాల తర్వాత పాక్ పౌర, సైనిక నాయకత్వాన్ని నవాజ్ షరీఫ్ అభినందించారు.

Related posts

చాపకింద నీరులా కోవిడ్ వ్యాప్తి.. మళ్లీ మాస్క్ తప్పనిసరి

M HANUMATH PRASAD

పాకిస్థాన్‌లో టెర్రరిస్ట్‌ సైఫుల్లా ఖతం.. నడిరోడ్డుపై కాల్చి చంపేశారు..

M HANUMATH PRASAD

బాల్య వివాహ నిషేధ చట్టం తెచ్చిన పాక్‌

M HANUMATH PRASAD

బంగాళాఖాతంలో భారత్ పడవలను ఢీ కొట్టిన బంగ్లాదేశ్ నౌక.. తెరపైకి షాకింగ్ ఘటన!

M HANUMATH PRASAD

అడ్రస్‌ లేకపోతే తిహాడ్‌ జైలులోనే ఉంటారు

M HANUMATH PRASAD

సింధు ఒప్పందంపై భారత్ కు అంతర్జాతీయ కోర్టు షాక్-తోసిపుచ్చిన కేంద్రం..!

M HANUMATH PRASAD