Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆగ్రహం తెప్పించారు హయత్ నగర్ సీఐ. వివాదాస్పద భూముల విషయంపై బాధితులు ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని సీరియస్ అయ్యారు.

పోలీసులు ఉన్నది బాధితుల కోసమే కదా.. మరెందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు.కోహెడలో తమ ప్లాట్లను కబ్జా చేశారని బాధితులు ప్రజావాణిలో భాగంగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రంగనాథ్ ను కలిసి వివరించారు. ఈ క్రమంలోనే ఆ వివాదాస్పద స్థలాన్ని బుధవారం రంగనాథ్ పరిశీలించారు.అయితే , ఆ ల్యాండ్ లో మారణాయుధాలు ఉండటం చూసి రంగనాథ్ అవాక్కయ్యారు. మరోసారి విషయం పూర్తిగా తెలుసుకొని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై దాడి జరిగినా, మారణాయుధాలు ల్యాండ్ లో ఉన్నా ఎందుకు కేసులు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐని ప్రశ్నించారు. వెంటనే బాధితుల ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

Related posts

వినాయకుని ఊరేగింపులో అపశృతి.. గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

M HANUMATH PRASAD

33 కాదు…17…రేవంత్ రెడ్డి మార్క్ జిల్లాలు

M HANUMATH PRASAD

గృహప్రవేశం మరునాడే ఇల్లు కూల్చివేత

M HANUMATH PRASAD

అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

M HANUMATH PRASAD

భూభారతి చట్టం కింద పట్టాలిస్తామంటున్న సర్కారు

M HANUMATH PRASAD

జెంటిల్ మాన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ గారు -ఏపీ సీఎం చంద్రబాబు

M HANUMATH PRASAD