Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

లోయలో పడ్డ ఆర్మీ వాహనము, ముగ్గురు జవాన్ల దుర్మరణం

జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానుల తో వెళ్తున్న ఆర్మీ వాహనం 700 అడుగుల లోయలో పడిపోయింది,ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడి కక్కడే మృతి చెందారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.దాదాపు 700 అడుగుల లోయలో ఈ ఆర్మీ వాహనం పడిపోయింది.

జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతోన్నా యి. ఈ సహాయక చర్యల్లో ఆర్మీ అధికారులు, కాశ్మీర్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తోపాటు స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు.

Related posts

రేప్ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

రాహుల్‌ ముఖానికి నల్ల రంగు పూస్తాం

M HANUMATH PRASAD

కాంగ్రెస్ ఎంపీ పాక్ పర్యటనపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమేనన్న సీఎం

M HANUMATH PRASAD

ఛీ.. ఛీ.. నడి రోడ్డు మీద యువతి పెదాలపై ముద్దులు.. వెలుగులోకి కామాంధుడి పైత్యం.. వీడియో వైరల్..

M HANUMATH PRASAD

పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్

M HANUMATH PRASAD

ప్రత్యేక బెంచ్‌ను నియమించిన బాంబే హైకోర్టు

M HANUMATH PRASAD