Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు పండ్ల విక్రేతలు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢకొీని ఇద్దరు పండ్ల విక్రేతలు దుర్మణం పాలైన ఘటన మండలంలోని శిరిగిరిపాడు శివారులో గురువారం జరిగింది.

ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్లకు చెందిన కరిముల్లా (50), నూర్జహాన్‌ (45) మాచర్లలోని అంబేద్కర్‌ సెంటర్‌లో తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటారు. వీరు తమకు కావాల్సిన పండ్లను మార్కాపురంలో తెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గురువారం వీరిద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మార్కాపురానికి వెళ్తున్నారు.

శిరిగిరిపాడు శివారులోకి వెళ్లగానే అదే గ్రామానికి చెందిన యువకుడు మరో ద్విచక్రవానంపై ఎదురుగుగా వచ్చి ఢకొీట్టాడు. దీంతో కరిముల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన నూర్జహాన్‌ను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కొద్దిసేపటికి మృతి చెందారు. ఢకొీట్టిన యువకునికి స్వల్ప గాయాలు కావడంతో గ్రామంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మృతురాలు నూర్జహాన్‌ మాచర్లకు చెందిన మహిళ కాగా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. మరో మృతుడు కరిముల్లా సొంతూరు మార్కాపురం కాగా కొన్నేళ్ల కిందట మాచర్లకు వచ్చి ఉంటున్నట్లు తెలిసింది. వెల్దుర్తి ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

Related posts

కూటమికి షాక్, 30 మంది వైసీపీలో చేరిక

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు

పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్‌

M HANUMATH PRASAD

టీటీడీలో సంచలనం..! జంగా కృష్ణమూర్తి గుడ్ బై..!

M HANUMATH PRASAD

బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు!

M HANUMATH PRASAD

ధనుంజయ్ రెడ్డిపై వైసీపీలో ఇంత వ్యతిరేకతా

M HANUMATH PRASAD