Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రీడా వార్తలు

భారత జట్టుకు కెప్టెన్‌గా సూర్యవంశి.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అండర్-19 భారత జట్టుకు సంబంధించి ఒక కీలక పరిణామాన్ని ప్రకటించింది. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన కోసం 14 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియా కెప్టెన్‌గా నియమిస్తూ జూనియర్ క్రికెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఈ పర్యటనలో భాగంగా జనవరి 3 నుండి 7 వరకు దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. క్రమం తప్పకుండా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆయుష్ మ్హత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా ఇద్దరూ మణికట్టు గాయాల కారణంగా ఈ పర్యటనకు దూరం కావడంతో, బీసీసీఐ వైభవ్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది.

ఇటీవల డొమెస్టిక్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డులే అతనికి ఈ నాయకత్వ బాధ్యతలు దక్కేలా చేశాయి. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే, దక్షిణాఫ్రికా సిరీస్ వరకు మాత్రమే వైభవ్ కెప్టెన్‌గా ఉంటాడని, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 ప్రపంచకప్ 2026 కు మాత్రం గాయం నుంచి కోలుకున్నాక ఆయుష్ మ్హత్రే తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ప్రపంచకప్ జట్టులో కూడా వైభవ్ సభ్యుడిగా ఉన్నాడు.

Related posts

రోహిత్ కాదు.. ఆ ఇద్దరి వల్లే కెప్టెన్‌గా నా పని ఈజీ అవుతోంది: హార్దిక్ పాండ్యా

గిట్ల ఆడినవ్ ఏంది కాకా..!!

నువ్వు సెంచరీ చేస్తే మ్యాచ్ మఠాషే..!!

M HANUMATH PRASAD

రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక ఓ బలమైన కారణం.. ఏం జరిగింది?

M HANUMATH PRASAD

బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా riyaan ?

M HANUMATH PRASAD

ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు మరో ఎదురుదెబ్బ