Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, సీఎంలకు తాకుతుంది: రాజా సింగ్


బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

వ్యవసాయానికి పనికివచ్చే ఆవులను, ఎద్దులను చంపడం పాపం అని అన్నారు. వాటిని చంపినవారికి ఎంత పాపం తగులుతుందో అంతే పాపం భారతదేశంలోని ప్రతి ఎంపీకి తాకుతుందని చెప్పారు. వాళ్ల కుటుంబ సభ్యులకు తరతరాలకు తగులుతుందని చెప్పారు. గోవదను నిషేదించాలని పార్లమెంట్‌లో ఎందుకు బిల్ వేయడం లేదని ప్రశ్నించారు.

గతంలో కొంతమంది ప్రైవేటు బిల్ వేసినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదో ఆలోచించాలని అన్నారు. గోవులను చంపి తిన్నవారికే కాకుండా నోరు మూసుకుని ఉన్న ఎంపీలకు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి తాకుతుందని చెప్పారు. ఇలాంటి పాపానికి గురికావద్దంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో గోవదను నిషేదించాలని బిల్ తీసుకురావాలని చెప్పారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోవదను అడ్డుకోకుండా రెండు మూడు రోజుల నుండి తమను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు.

Related posts

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద హైడ్రా కూల్చివేతలు

M HANUMATH PRASAD

రేవంత్ సభలో తీన్మార్ మల్లన్న – యూటర్న్ ?

M HANUMATH PRASAD

తెలంగాణ సీఎస్ ను జైలుకు పంపాల్సి వస్తుంది..: కంచ గచ్చబౌలి భూములపై సిజెఐ జస్టిస్ గవాయ్ సీరియస్

M HANUMATH PRASAD

సెట్విన్ పాత బస్తీ నుంచి మారిస్తే కుదరదు

M HANUMATH PRASAD

పాపం పండింది…ధర్మానిదే గెలుపు… ఈడీ చార్జిషీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరుపై కేటీఆర్ సంచలన ట్వీట్

M HANUMATH PRASAD

సొంత పార్టీ వాళ్లే ఓడించారు.. భారాస ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD