Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

రాజాసింగ్ కు సీరియస్ గా నోటీసులు

గొషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒంటరిగా బయటకు రావద్దంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా బయటకు రావద్దని, ఒంటరిగా ఎట్టిపరిస్థితుల్లోనూ తిరగవద్దని పోలీసులు తెలిపారు.

రాజాసింగ్ కు తరచూ బెదిరింపు కాల్స్ రావడంతో ఈ మేరకు మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్ తరచూ ఒంటరిగా బయటకు వెళుతుండటంతో పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

సున్నితమైన ప్రాంతాల్లో…సున్నితమైన ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. జిర్రా, గోల్కొండ, యాకుత్ పుర, సంతోష్ నగర్, బహదూర్ పుర, బాబా నగర్, ఇంజబోలి, భవానీ నగర్, తలాబ్ కట్ట ప్రాంతాలకు భద్రతా సిబ్బంది లేకుండా బయటకు వెళ్లడం గమనించిన పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. తమకు సమాచారం అందించకుండా బయట ప్రాంతాలకు కాని, నియోజకవర్గ పర్యటనకు కాని వెళ్లవద్దని సూచించారు.

Related posts

పిలుపువస్తే యుద్ధానికి నేను సైతం- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

చంచల్ గూడ జైలులో ‘A’ క్లాస్ సౌకర్యాలు కల్పించండి – గాలి జనార్ధన రెడ్డి

M HANUMATH PRASAD

డీఎస్పీ గా అవతారమెత్తిన కేటుగాడు అరెస్ట్

M HANUMATH PRASAD

లేఖ పై తొలిసారి స్పందించిన కవిత.. కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

రూ.300కోట్ల స్థలం కబ్జా వ్యవహారం నిందితులపై కేసు

M HANUMATH PRASAD

హైదరాబాద్‌లో పాక్ ఉగ్రవాదులు? వీడియో వైరల్

M HANUMATH PRASAD