Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో రైలు పైకి ఎక్కిన విద్యార్థి…విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృతి

తిరుపతిలోని మామండూరులో విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్‌లో ఓ విద్యార్థి రైలు పైకి ఎక్కడంతో హైవోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడు.

విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోవడంతో చూసిన రైల్వే అధికారులు వెంటనే స్థానిక ఆస్పత్రి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. చనిపోయిన విద్యార్థి డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్‌గా పోలీసులు గుర్తించారు. విద్యార్థి రైలు దిగి ఆ తరవాత అవతలివైపునకు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న రైలుపైకి ఎక్కినట్టు తెలుస్తోంది. ప్లాట్ ఫాంపై నుండి వెళ్లకుండా రైలు ఎక్కడం వల్లనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అసలు రైలు ఎందుకు ఎక్కాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు

M HANUMATH PRASAD

రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఆధార్ తరహాలో

హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు

M HANUMATH PRASAD

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్ రాబోతుంది. త్వరలోనే టెండర్లు!

M HANUMATH PRASAD

దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష

M HANUMATH PRASAD

వంశీ ఆరోగ్యం అసలు బాగోలేదు: భార్య పంకజశ్రీ

M HANUMATH PRASAD