Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహం ఊరికే పోదు… చంద్రబాబును లోకేశ్‌ గద్దె దించుతారు : మాజీమంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్నారని విమర్శలు గుప్పించారు.

సీఎం చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటుపొడిచారు అని పేర్ని నాని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు చేసిన పాపం ఊరికే పోదు అని పేర్ని నాని చెప్పుకొచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీమంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన తనయుడు మంత్రి లోకేశ్ వెన్నుపోటు పొడవడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీని…ముఖ్యమంత్రి కుర్చీని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేశ్ లాక్కోవడం ఖాయం అంటూ మాజీమంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు లోకేశ్ వెన్నుపోటు ఖాయంఅంతులేని పాపాలను చంద్రబాబు నాయుడు మూటకట్టుకుంటున్నారని…శిశుపాలుడిగా పాపాలు చేసుకుంటూ పోతున్నారని మాజీమంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో అదే వెన్నుపోటు లోకేశ్…సీఎం చంద్రబాబు నాయుడుకు పొడుస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీని…సీఎం కుర్చీని నారా లోకేశ్ లాక్కోబోతున్నారని చెప్పుకొచ్చారు. ఏదోఒక రోజు చంద్రబాబు నాయుడును లోకేశ్ వెన్నుపోటు పొడవడం ఖాయం అని చెప్పుకొచ్చారు. నారా లోకేశ్ ఎన్టీఆర్ మనవడిని అని చెప్పుకుంటున్నారే తప్ప ఖర్జూరనాయుడు మనవడినని ఎందుకు చెప్పుకోవడం లేదు అని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. గృహప్రవేశంలో తోబుట్టువులు ఎక్కడ చంద్రబాబూకుప్పంలో చంద్రబాబు నాయుడుకు ఇల్లు లేదని వైసీపీ అధినేత జగన్ పదేపదే విమర్శించారని… అందువల్లే హడావుడిగా రెండెకరాల్లో ఇల్లు కట్టారు అని మాజీమంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గృహప్రవేశ కార్యక్రమంలో తోబుట్టువులు ఎక్కడ అని ప్రశ్నించారు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఆడపడుచులు ఆయన ఇండి గడప తొక్కారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్, కుప్పం, అమరావతిలలో వందల కోట్లతో ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేస్తే అక్కచెల్లెళ్లు ఎవరైనా వచ్చారా?అని మాజీమంత్రి పేర్ని నాని నిలదీశారు. రాజమహల్, జైపూర్ ప్యాలెస్‌లాంటి ఇళ్లు కట్టుకుని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు అని మాజీమంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పిన్నెల్లి సోదరులపై అన్యాయంగా కేసులుపల్నాడులో జంట హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇరికించింది అని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారని ప్రశ్నించారు. హత్యకు గురైన వారు టీడీపీ వారేనని..హత్య చేయించింది కూడా టీడీపీవారేనని స్వయంగా ఎస్పీ చెప్పారని మాజీమంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. ఆధిపత్యపోరులోనే ఈ రాజకీయ హత్యలు జరిగాయి అని పోలీసులే నిర్ధారించారని గుర్తు చేశారు. కానీ ఎఫ్ఐఆర్‌లో మాత్రం వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుల మీద కేసు నమోదు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిచారు. ఈ కేసులో అసలైన హంతకులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులు..సన్నిహితులేనని మాజీమంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

 

Related posts

పవన్ కళ్యాణ్ కు ప్రధాని చాక్లేట్ గిఫ్ట్

85 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై కేసులు నమోదు

M HANUMATH PRASAD

రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఆధార్ తరహాలో

ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి

M HANUMATH PRASAD

అమరావతి సక్సెస్ కాదు-మొండిగా ముందుకెళ్లొద్దు-బాబుకు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సలహా..!

M HANUMATH PRASAD

నేను మీ చెల్లి తో కాపురం చేయాలంటే నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వాలి – మరిది అరాచకం