Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్‌ యాత్ర జూన్‌ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్లామిక్‌ చంద్రమాన క్యాలెండర్‌లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్‌ యాత్ర తేదీలను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.

ప్రతి ఏటా ఈ తేదీలు మారుతుంటాయి.

ఈ ఏడాది జూన్‌ 4 నుంచి నాలుగు రోజులపాటు హజ్‌ యాత్ర కొనసాగుతుంది. ఇందులో రెండో రోజు అంటే జూన్‌ 5న అరాఫత్‌ మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో హజ్‌ యాత్రికులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. మహమద్‌ ప్రవక్త చివరి ఉపన్యాసం ఇచ్చిన రోజుగా దీనిని పరిగణిస్తారు. జూన్‌ 6న ఈద్‌-అల్‌-అధాను జరుపుకుంటారు. ఈసారి హజ్‌ యాత్రలో దాదాపు పది లక్షల మంది ముస్లింలు పాల్గొంటారని అంచనా.

Related posts

‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్‌ ఆర్మీ చీఫ్‌

M HANUMATH PRASAD

37 వేల మంది పౌరసత్వం రద్దు–కువైట్‌ ప్రభుత్వం నిర్ణయం

M HANUMATH PRASAD

చేతులకు సంకెళ్లతో బందీగా న్యూయార్క్ లో మదురో: గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్.. !!

M HANUMATH PRASAD

షక్స్‌గామ్ వ్యాలీ మాదే, భారత్‌ది కాదు”.. చైనా ప్రకటన..

M HANUMATH PRASAD

దేశం గజగజ వణికిపోవడం గ్యారెంటీ.. ప్లాన్ ప్రకారమే ఉస్మాన్ హదీని కరీం హత్య చేశాడా?

M HANUMATH PRASAD

భారత్‌ దెబ్బకు కుదేలైన సెలెబీ షేర్‌: 10శాతానికి పైగా పతనం

M HANUMATH PRASAD