Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

మీరు ఎవరికైనా చెక్కు ఇస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. కొత్త నిబంధనలు!

చెక్కు బౌన్స్‌కు సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, 1881లో పెద్ద మార్పులు చేసింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి.

ఈ మార్పులు మోసాలను నిరోధించడం, చెల్లింపు వ్యవస్థను పారదర్శకంగా చేయడం, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పులు, ప్రజలపై వాటి ప్రభావం గురించి తెలుసుకుందాం.

కొత్త చట్టం ప్రకారం.. చెక్ బౌన్స్ కేసులలో దోషికి ఇప్పుడు మునుపటి కంటే కఠినంగా శిక్ష ఉంటుంది. NI చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం.. చెక్కు బౌన్స్ అయితే, నిందితుడికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, చెక్కు మొత్తానికి రెండింతలు జరిమానా విధించవచ్చు.

దీనితో పాటు కోర్టులో పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసుల విచారణ కూడా గతంలో కంటే వేగంగా జరుగుతుంది. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా అమలు చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసులను విచారించిన తర్వాత నిర్ణయాలు కూడా త్వరగా తీసుకుంటున్నారు.

గతంలో చెక్కు బౌన్స్ అయిన నెలలోపు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయాల్సి ఉండేది. ఇప్పుడు దానిని మూడు నెలలకు పొడిగించారు. అంటే ఫిర్యాదుదారుడు తన పక్షాన్ని ప్రదర్శించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. దీనితో పాటు, ఇప్పుడు చెక్ బౌన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. అలాగే డిజిటల్ ఆధారాలు కూడా గుర్తిస్తారు. దీనివల్ల ఫిర్యాదు చేయడం సులభం అవుతుంది.

అన్ని బ్యాంకులకు ఒకే ప్రక్రియ అమలు చేస్తారు. అంటే చెక్ బౌన్స్ కేసు ఏ బ్యాంకుకు సంబంధించినదైనా, అదే విధంగా చర్య తీసుకుంటారు. ఒక వ్యక్తి చెక్కు వరుసగా మూడుసార్లు బౌన్స్ అయితే, బ్యాంకు ఆ ఖాతాను కూడా స్తంభింపజేయవచ్చు.

 

Related posts

రాహుల్‌ ముఖానికి నల్ల రంగు పూస్తాం

M HANUMATH PRASAD

ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం!

M HANUMATH PRASAD

మరణశిక్ష పడిన దోషిని నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు

M HANUMATH PRASAD

ఆత్మాహుతికి సిద్ధమైన సమీర్‌, సిరాజ్‌! దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక

M HANUMATH PRASAD

పాక్‌ డ్రోన్లు కూల్చడానికి రూ.15 లక్షల విలువైన క్షిపణులా?: కాంగ్రెస్ నేత

M HANUMATH PRASAD

మోడీ నాయకత్వంలో దేశం సేఫ్‌గా లేదు.. CPI నేత రాజా కీలక వ్యాఖ్యలు

M HANUMATH PRASAD