Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన MIM ఎమ్మెల్యేలు

వక్ఫ్ సవరణ చట్టానికి(Waqf Amendment Act) నిరసనగా హైదరాబాద్‌లో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలు(MIM MLAs) మానవహారం నిర్వహించారు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పిలుపుతో మానవహారంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును కేంద్రం(NDA Govt) వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. వక్ఫ్ అనేది ఇస్లాంలో అంతర్భాగం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇటీవల తెలిపింది.

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ ఆస్తుల రక్షణ ప్రభుత్వ బాధ్యత అని, వాటిని స్వాధీనం చేసుకుంటారనే ప్రచారం అవాస్తవమని కేంద్రం పేర్కొంది. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని కూడా సమర్థించింది. ఈ చట్టంపై పిటిషనర్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Related posts

జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయాము – వైసీపీ మాజీ ఎమ్మెల్యే

M HANUMATH PRASAD

మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి కి సుప్రీమ్ కోర్టు బిగ్ రిలీఫ్

M HANUMATH PRASAD

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

M HANUMATH PRASAD

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

M HANUMATH PRASAD

కూతురు కొడుకు వారసుడు అవుతాడా ?

M HANUMATH PRASAD

వల్లభనేని వంశీకి బెయిల్

M HANUMATH PRASAD