Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

నన్ను పెళ్లి చేసుకోండి…: పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా… వెలుగులోకి షాకింగ్ విషయాలు…!

పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధం ఉందని అనుమానిస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై భారత భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి.

ఈ క్రమంలోనే గూఢచర్యం, సరిహద్దు అక్రమ రవాణా, శత్రు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం… వంటి వాటితో సంబంధం ఉన్న యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా సహా 12 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జ్యోతి మల్హోత్రా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చిందని ఎన్‌డీటీవీ రిపోర్టు చేస్తుంది. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఐఎస్‌ఐతో జ్యోతి మల్హోత్రాకు ఉన్న పరిచయాలను మరింత బహిర్గతం చేస్తున్నాయి.ఇక, హర్యానాలోని హిసార్‌కు చెందిన జ్యోతి మల్హోత్రా… ”ట్రావెల్ విత్ జో” అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఆమెను గత వారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా పాకిస్తాన్ ఐఎస్‌ఐ కోసం పనిచేసిన అలీ హసన్‌తో ఆమె నిరంతరం సంప్రదింపులు జరిపినట్టుగా తేలిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అలీ హసన్, జ్యోతి మల్హోత్రాలు చాలా మాట్లాడుకునేవారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఒక చాట్‌లో… ”నన్ను పాకిస్తాన్‌లో వివాహం చేసుకోండి”అని అలీ హసన్‌ను జ్యోతి మల్హోత్రా కోరింది. వాట్సాప్ చాట్‌లలో ఇద్దరి మధ్య అనేక కోడెడ్ సంభాషణలను కూడా వెల్లడించాయని సమాచారం. ముఖ్యంగా భారతదేశం రహస్య కార్యకలాపాలకు సంబంధించినవి ఉన్నట్టుగా తెలుస్తోంది. దర్యాప్తులో మల్హోత్రాకు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల గురించిన సమాచారాన్ని కనుగొన్నట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. ఒక ఖాతాలో దుబాయ్ నుంచి లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించినట్టుగా సమాచారం. అయితే జ్యోతి మల్హోత్రా ఎక్కడెక్కడి నుంచి డబ్బు అందుకుంటుందో తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్థలు ఆమెకు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నాయి. ఇక, జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో లోతైన దర్యాప్తులో ఆమెకు పాకిస్తాన్‌ కోసం ఏ విధంగా పనిచేశారనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే, జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత దర్యాప్తు అధికారులు.. పహల్గామ్, పాకిస్తాన్‌లకు ఆమె పర్యటనలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆమె చేపట్టిన ఈ రెండు పర్యటనలకు లింక్ ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే… 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న భయంకరమైన ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు 2025 ప్రారంభంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ను సందర్శించారని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కు వెళ్లారు. ఈ రెండు పర్యటనలు చాలా తక్కువ వ్యవధిలో జరిగాయి. ఈ రెండు పర్యటనలకు ఏమైనా లింక్ ఉందా? అని దర్యాప్తు సంస్థలు ఇప్పుడు పరిశీలిస్తున్నాయి.హిసార్ పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ…. ”ఆధునిక యుద్ధం సరిహద్దుల్లో మాత్రమే జరగదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పీఐవోలు) తమకు అవసరమైన సమాచారం సేకరించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను నియమించుకుంటున్నారని మేము కనుగొన్నాము. ఏజెన్సీల నుండి మాకు ఈ సమాచారం అందింది. వారు ఆమెను (జ్యోతి మల్హోత్రా) ఒక అసెట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఆమె పీఐవోలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆమె పాకిస్తాన్‌కు వెళ్లేది. ఆమె చైనాను కూడా సందర్శించింది. పహల్గామ్ దాడికి ముందు ఆమె పాకిస్తాన్‌ను సందర్శించింది” అని తెలిపారు.”ఈ రెండు సందర్శనల మధ్య సంబంధాలు ఉందా?… ఉంటే అందుకు తగిన ఆధారాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఆమెతో ఇతర వ్యక్తులు కూడా పాల్గొన్నారని మాకు ఆధారాలు ఉన్నందున మేము దర్యాప్తు చేస్తున్నాము” అని శశాంక్ కుమార్ సావన్ తెలిపారు.

 

Related posts

రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన ప్రాపర్టీ మీ సొంతం కాదు…సుప్రీం కోర్టు తాజా తీర్పు ఏం చెబుతోంది..

M HANUMATH PRASAD

వామ్మో… చెన్నైలో రోడ్డుపై భారీ గుంత.. షాక్ అవ్వాల్సిందే

M HANUMATH PRASAD

పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..: ప్రొఫెసర్‌పై సుప్రీం పైర్

M HANUMATH PRASAD

కుగ్రామం నుంచి ప్రధాన న్యాయమూర్తిగా.. గవాయ్ జీవిత విశేషాలు

M HANUMATH PRASAD

కర్రెగుట్టలో బారీ సంఖ్యలో మావోల మృతి

M HANUMATH PRASAD

కాంగ్రెస్‌కు హార్ట్‌ బ్రేక్‌.. ఆర్టికల్ 370 రద్దు ప్రశంసనీయం.. హస్తం నేత వ్యాఖ్యలు

M HANUMATH PRASAD