Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

పాక్‌ నుంచి అఫ్గాన్‌ సరుకు ట్రక్కులకు అనుమతి

పరేషన్‌ సిందూర్‌ కారణంగా సరిహద్దులు మూసివేయడంతో పాకిస్థాన్‌లో నిలిచిపోయిన 150 అఫ్గాన్‌ సరకు రవాణా ట్రక్కులను వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారత్‌ వచ్చేందుకు అనుమతించారు.

వీటిలో అధిక శాతం డ్రై ఫ్రూట్స్‌ తీసుకువచ్చేవే. ఇప్పటికే 8 ట్రక్కులు భారత్‌ చేరుకున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల పాలనలోకి వెళ్లాక తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్‌ ముత్తాఖీతో గురువారం ఫోన్‌లో సంభాషించారు. ఈమేరకు జైశంకర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. అంతేగాక తప్పుడు, నిరాధార వార్తలతో భారత్‌, అఫ్గానిస్థాన్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాలను తిప్పికొట్టడాన్ని స్వాగతించారు. సుదీర్ఘ కాలంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను గుర్తుచేసినట్లు జైశంకర్‌ పేర్కొన్నారు.

Related posts

బంగాళాఖాతంలో భారత్ పడవలను ఢీ కొట్టిన బంగ్లాదేశ్ నౌక.. తెరపైకి షాకింగ్ ఘటన!

M HANUMATH PRASAD

పహల్గాం దాడిలో పాకిస్తాన్ కమాండోలు.. బాంబు పేల్చిన పాక్ జర్నలిస్టు

M HANUMATH PRASAD

స్కూల్ బస్సుపై ఉగ్రదాడి..నలుగురు పిల్లలు మృతి, 38 మందికి గాయాలు

M HANUMATH PRASAD

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్లే.. పేర్లు రిలీజ్‌ చేసిన భారత్‌

M HANUMATH PRASAD

4 నుంచి హజ్‌ యాత్ర.. ప్రకటించిన సౌదీ అరేబియా

M HANUMATH PRASAD

భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

M HANUMATH PRASAD