Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

85 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై కేసులు నమోదు

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 85 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై కేసులు నమోదు చేసి మూడు లక్షల 70 వేల రూపాయల జరిమానాలను విధించామని ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా కమిషనరు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై వాహన తనిఖీలు ప్రతివారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో వాహన తనిఖీ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారులపై విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన 85 బస్సులపై కేసులు నమోదు చేసి 3.70 లక్షల రూపాయలను అపరాధ రుసుముగా విధించామని జిల్లా ఉపరమణ కమిషనర్ షేక్ కరీం ఒక ప్రకటనలో తెలియజేశారు . ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని డిటిసి స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో జంగారెడ్డిగూడెం ఆర్టీవో ఎండి. మదని, వాహన తనిఖీ అధికారులు ఎస్.రంగనాయకులు, జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు, ఎస్.జగదీష్ బాబు, కళ్యాణి, కృష్ణవేణి, పి.నరేంద్ర బాబు, అన్నపూర్ణ, డి.ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు

M HANUMATH PRASAD

విజయనగరాన్ని సిరాజ్ ఎందుకు ఎంచుకున్నాడంటే?

M HANUMATH PRASAD

డిఎస్పీ వాయిదా వేయండి

M HANUMATH PRASAD

వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోండి -డాక్టర్ సత్యనారాయణ మూర్తి

M HANUMATH PRASAD

M HANUMATH PRASAD

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్ రాబోతుంది. త్వరలోనే టెండర్లు!

M HANUMATH PRASAD