ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో రైల్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా..గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
పెరిగిన ఛార్జీల వివరాలు
మొదటి రెండు స్టాప్లకు రూ.12
రెండు నుంచి 4 స్టాప్ల వరకు రూ.18
4 నుంచి 6 స్టాప్ల వరకు రూ.30
6 నుంచి 9 స్టాప్ల వరకు రూ.40
9 నుంచి 12 స్టాప్ల వరకు రూ.50
12 నుంచి 15 స్టాప్ల వరకు రూ.55
15 నుంచి 18 స్టాప్ల వరకు రూ.60
18 నుంచి 21 స్టాప్ల వరకు రూ.66
21 నుంచి 24 స్టాప్ల వరకు రూ.70
24 స్టాప్లు.. ఆపైన రూ.75
