Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

ఇండియాలో పట్టుబడ్డ బంగ్లాదేశీలను సొంతదేశానికి తరలింపు

ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ పౌరులను మోడీ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయలను చాలా మందిని పోలీసులు గుర్తించారు.

కాగా తాజాగా అలా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల్లో మొదటి బ్యాచ్‌ను అధికారులు రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు తరలించారు. మూడు వ్యానుల్లో పోలీసుల సెక్యురిటీ నడుమ వారిని జోద్ పూర్ తరలించగా అక్కడ నుండి వారిని బంగ్లాదేశ్‌కు తరలించనున్నారు. మరోవైపు బెంగాల్‌లో చాలా మంది బంగ్లాదేశీలు అక్రమంగా తరలివచ్చి నివసిస్తున్నారే ఆరోపణలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. అక్రమంగా తరలివచ్చిన విదేశీయులతో ఎప్పుడు ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియదని ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుంది. వారందరినీ గుర్తించి సొంత దేశానికి తరలించే చర్యలు చేపడుతోంది.

Related posts

పాక్ లో సంబరాలు

M HANUMATH PRASAD

పాకిస్థాన్‌లో టెర్రరిస్ట్‌ సైఫుల్లా ఖతం.. నడిరోడ్డుపై కాల్చి చంపేశారు..

M HANUMATH PRASAD

ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి!

M HANUMATH PRASAD

మాకు పోయేదేం లేదు.. యాపిల్ కే నష్టం.. ట్రంప్ కు షాకింగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

M HANUMATH PRASAD

ఈ రోజు త్వరగా చీకటి కాదు!*

M HANUMATH PRASAD

బంగాళాఖాతంలో భారత్ పడవలను ఢీ కొట్టిన బంగ్లాదేశ్ నౌక.. తెరపైకి షాకింగ్ ఘటన!

M HANUMATH PRASAD