Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

జవాన్ సమస్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.

రాష్ట్రానికి సంబంధించిన జవాన్ మోహన్ (Jawan Mohan) సమస్యకు పరిష్కారం దొరికింది. ఏపీ జవాన్ మోహన్ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) ఎట్టకేలకు స్పందించారు.

జవాన్ సమస్యను వెంటనే పరిష్కరించాలని మదనపల్లి ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషాకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. దీంతో అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెమ్మ గారి పల్లెకు చెందిన ఆర్మీ జవాన్ మోహన్ ఇంటి సమస్య పరిష్కరించబడింది.

లోకల్ ఎమ్మెల్యేకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా జవాన్ తండ్రి బయ్యప్ప గారి కృష్ణప్పతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని నారా లోకేష్ కు ( Nara Lokesh) ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. దీంతో వెంటనే ఆ జవాన్ తండ్రి కృష్ణప్పతో ఫోన్ లో మాట్లాడిన నారా లోకేష్… సమస్యను వెంటనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

ఇది ఇలా ఉండగా.. చిట్టెమ్మ గారి పల్లెకు చెందిన జవాన్ మోహన్… కుటుంబానికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేశారని తెలుస్తోంది. తన భూమితో పాటు ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని… ఓ వీడియో ద్వారా మోహన్ స్పష్టం చేశాడు. తన భూమిని రక్షించాలని.. ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. ఈ వీడియో వైరల్ కావడంతో తాజాగా చంద్రబాబు నాయుడు స్పందించి.. రంగంలోకి దిగారు.

Related posts

రేవంత్ గాలితీసిన ఏపీ సర్కార్.. తెలంగాణ అసెంబ్లీలో సీఎం పగ్రల్భాలపై మండిపాటు

M HANUMATH PRASAD

రెడ్ బుక్ మరువను..! కేడర్‌ను ఇబ్బంది పెట్టినవారిని వదలను..

M HANUMATH PRASAD

*YS Jagan consoles parents of Martyred Murali Naik*

M HANUMATH PRASAD

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు

M HANUMATH PRASAD

85 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై కేసులు నమోదు

M HANUMATH PRASAD

విశాఖలో పిడుగుపడి భారీ పేలుడు

M HANUMATH PRASAD