Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

పాకిస్తాన్ కాల్పులలో విధులు నిర్వహిస్తూ మురళీనాయక్ మృతి-

హైదరాబాద్:మే 09
భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు గా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు.

మృతి చెందిన జవాన్‌ను మురళీనాయక్‌గా గుర్తిం చారు. ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లి తండా. రేపు స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు సమాచారం.

తల్లిదండ్రులకు మురళి నాయక్,ఏకైక సంతానం. ఇక సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌ విద్యా వ్యాసం చేసిన వీర జవాన్.. 2022లో ఇండియన్‌ ఆర్మీలో చేరాడు.

నాసిక్‌లో శిక్షణ పొంది, జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్‌ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్‌లో పనిచేస్తుం డగా.. భారత్-పాక్‌ ఉద్రిక్త తల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడ పాక్‌ కాల్పుల్లో వీరమరణం పొందాడు…..

Related posts

ఇండియాలో పట్టుబడ్డ బంగ్లాదేశీలను సొంతదేశానికి తరలింపు

M HANUMATH PRASAD

స్కూల్ బస్సుపై ఉగ్రదాడి..నలుగురు పిల్లలు మృతి, 38 మందికి గాయాలు

M HANUMATH PRASAD

రా.. దమ్ముంటే నన్ను తీసుకెళ్లు: మదురో అరెస్ట్ వేళ ట్రంప్‎కు కొలంబియా అధ్యక్షుడు ఛాలెంజ్

M HANUMATH PRASAD

‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు!

M HANUMATH PRASAD

37 వేల మంది పౌరసత్వం రద్దు–కువైట్‌ ప్రభుత్వం నిర్ణయం

M HANUMATH PRASAD

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్లే.. పేర్లు రిలీజ్‌ చేసిన భారత్‌

M HANUMATH PRASAD