Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలు

సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా

 

* చేర్యాల పట్టణం చెరువు సమీపంలో పై నిందితులు కలసి ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు చేర్యాల పోలీసులు వెళ్లి రైడ్ చేసి కమల శ్రీనివాస్, కూరపాటి శివ ప్రసాద్, నర్రా చంద్రబాబు, ఎల్ల నవీన్ కుమార్ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పారిపోయినారు, అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుండి 76,400 రూపాయలు, నాలుగు మొబైల్ ఫోన్లో, మూడు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకొని చేర్యాల పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. పై నిందితులు పై నలుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని సీఐ ఒక ప్రకటనలో తెలిపారు. కేసు పరిశోధన కొనసాగుతుంది మరికొంతమంది నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ పేకాట తదితర చట్ట వ్యతిరేకత కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

గ్రామాలలో గాని పట్టణంలో కానీ ఎవరైనా పేకాట గంజాయి ఇతర మత్తు పదార్థాలు బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వెంటనే డయల్ 100 లేదా చేర్యాల పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

చేర్యాల ప్రొఫెషనల్ ఎస్ఐ సమత హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Related posts

పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరూ జంప్‌.. అత్తకు 55, అల్లుడికి 25 ఏళ్లు

M HANUMATH PRASAD

ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్ ఇంజెక్ట్‌ చేసి రేప్‌ చేశాడు.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణ

M HANUMATH PRASAD

బాలాపూర్లో దారుణం.. అనుమానంతో భార్యను చంపేసి భర్త పరార్..

M HANUMATH PRASAD

రిసెప్షనిస్ట్‌ అంకిత కేసులో సంచలన తీర్పు

M HANUMATH PRASAD

టీ. వి. యాంకర్ ఆత్మ హత్య – అనుమానాలు?

M HANUMATH PRASAD

మరణశిక్ష పడిన దోషిని నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు

M HANUMATH PRASAD